ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ లోకాయుక్తలో విచారణలు ఉండవు

ABN , First Publish Date - 2020-03-29T22:48:21+05:30 IST

కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ లోకాయుక్తలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ విచారణలు ఉండవని ఒక ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ లోకాయుక్తలో విచారణలు ఉండవు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ లోకాయుక్తలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ విచారణలు ఉండవని ఒక ప్రకటనలో తెలిపింది. ఫిర్యాదు దారులు, అధికారులు విచారణలకు రావద్దని ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే పోస్ట్‌ ద్వారా చేయవచ్చని తెలిపారు. లోకాయుక్త అదికారులు, సిబ్బంది కూడా ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. కొందరు కీలక అధికారులు మాత్రమే విధులను హాజరు కావాలని లోకాయుక్త రిజిస్ర్టార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-03-29T22:48:21+05:30 IST