శ్మశానంలో వసతుల కరువు

ABN , First Publish Date - 2022-08-09T04:18:19+05:30 IST

పొదలకూరు గ్రామ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీస సౌకర్యాలు లేక అంత్యక్రియలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

శ్మశానంలో వసతుల కరువు
వసతులు లేని శ్మశానంలో సామాజిక కార్యకర్తలు పీపీఎన్‌ ప్రసాద్‌, అట్ల హరిబాబు

 అంత్యక్రియలకు ఇక్కట్లు

పొదలకూరు, ఆగస్టు 8 : పొదలకూరు గ్రామ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీస సౌకర్యాలు లేక అంత్యక్రియలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.  ఏళ్ల తరబడి పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లతో, చెత్తతో నిండిపోయి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దాతలు స్పందించి కొంత అభివృద్ధి చేసినా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా అధికా రులు స్పందించి శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. భారీ ఎత్తులో ఉన్న మొక్కలతో శ్మశాన వాటిక చిట్టడవిని తలపిస్తోంది. శ్మశానం దారి అభివృద్ధి చేసి చెట్లు తొలగించాలని, శ్మశానం చుట్టూ ప్రహరీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా పంచా యతీ యంత్రాంగం స్పందించాలని పలువురు సామాజిక కార్యకర్తలు పీపీఎన్‌ ప్రసాద్‌, అట్ల హరిబా బుయాదవ్‌, రమేష్‌, మద్దిరిళ్ల ప్రసాద్‌, పసల సతీష్‌, పద్మనాభం, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-09T04:18:19+05:30 IST