కక్ష సాధింపు ఫుల్‌.. అభివృద్ధి, సంక్షేమం నిల్‌

ABN , First Publish Date - 2020-02-20T10:14:25+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం సర్వనాశనమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ‘ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు ఫుల్‌...

కక్ష సాధింపు ఫుల్‌.. అభివృద్ధి, సంక్షేమం నిల్‌

  • తుగ్లక్‌ పాలనకు పతనం ఆరంభం: లోకేశ్‌


మంగళగిరి టౌన్‌, ఫిబ్రవరి 19: వైసీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం సర్వనాశనమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ‘ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు ఫుల్‌... అభివృద్ధి, సంక్షేమం నిల్‌. ఈ తొమ్మిది మాసాల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప... తుగ్లక్‌ సీఎం చేసిన ఒక్క మంచి పనీ లేదు. దుర్మార్గ విధానాలను అవలంభిస్తున్న వైసీపీ ప్రభుత్వం పతనం ఆరంభమైంది’ అని అన్నారు. బుధవారం మంగళగిరిలో ప్రారంభమైన ప్రజాచైతన్య యాత్రలో లోకేశ్‌ పాల్గొన్నారు.


  కియ, లులు, అదానీ వంటి సంస్థలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని, నిరుద్యోగ భృతినీ రద్దు చేయడంతో యువత భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. 3ముక్కల రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య చీలికలు తెచ్చి, ప్రజల్లో చిచ్చుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.


Updated Date - 2020-02-20T10:14:25+05:30 IST