కూల్చివేతలు తప్ప అబివృద్ధి ఏదీ ?
ABN , First Publish Date - 2021-07-25T06:05:39+05:30 IST
రాష్ట్రంలో అవినీతి, కూల్చివేతలు తప్ప అబివృద్ధి ఏదీ లేదని ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని అన్నారు.
వరినాట్లు వేసి టీడీపీ నేతల నిరసన
గుడిపాల, జూలై 24: రాష్ట్రంలో అవినీతి, కూల్చివేతలు తప్ప అబివృద్ధి ఏదీ లేదని ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని అన్నారు. శనివారం మండల టీడీపీ సీనియర్ నేత సుబ్రమణ్యంనాయుడు ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మసముద్రం దళితవాడ వద్ద జగనన్న పాలనలో అడుగడుగునా సంత అడుగుక్కో గుంత కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గుంతలుగా మారిన రోడ్లలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్య, గత ప్రభుత్వంలో చేసిన అబివృద్ధిపనులను కూల్చివేయడమే తప్ప రెండు కిలో మీటర్ల రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కార్యక్రమం లో మండల టీడీపీ నాయకులు హేమాద్రినాయుడు, చంద్రమోహన్, ధనసింగ్, మురళీనాయుడు, రవినాయుడు, సాంబశివ నాయుడు, చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గంజి మాదవయ్య, వాసు, అధికారప్రతినిది దనంజయనాయుడు, పుత్తూరు పట్టణ రూరల్పార్టీ నాయకులు జీవరత్నం నాయుడు, రవికుమార్, చిత్తూరు పార్లమెంటు యువత అధ్యక్షులు రాజేష్, గుడిపాల మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.