ఏ క్రికెట్ మ్యాచ్ న్యాయం జరగదు.. అన్ని ఫిక్స్డ్యే: చావ్లా
ABN , First Publish Date - 2020-05-30T19:43:09+05:30 IST
రెండు దశాబ్ధాల తర్వాత యూకేలో ఉంటున్న బుకీ సంజీవ్ చావ్లాని ఇండియాకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 2000 సంవత్సరంలో జరిగిన అతి పెద్ద క్రికెట్
రెండు దశాబ్ధాల తర్వాత యూకేలో ఉంటున్న బుకీ సంజీవ్ చావ్లాని ఇండియాకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 2000 సంవత్సరంలో జరిగిన అతి పెద్ద క్రికెట్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన అతను తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా న్యాయంగా జరగదు అని అతను అన్నాడు.
‘‘ఏ క్రికెట్ మ్యాచ్ న్యాయంగా జరగదు. ప్రతీ మ్యాచ్ ఫిక్స్డ్యే. ప్రతీ మ్యాచ్ వెనుక ఓ పెద్ద మాఫియా ఉంది. ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాలా మ్యాచ్లు జరుగుతాయి. వీటి వెనుక ఉన్నవాళ్లు చాలా ప్రమాదకరం. మనం ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. వాళ్లు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు’’ అని చావ్లా తెలిపాడు.