వివాహమై ఏడాది గడిచినా పిల్లలు పుట్టలేదని...
ABN , First Publish Date - 2020-09-20T14:59:48+05:30 IST
వాషర్మెన్పేటలోని అశోక్నగర్లో దంపతులు ఉరేసుకున్నారు. వెస్ట్ మాంబళం రాజాజీవీధికి చెందిన మణికంఠన్(34), నందిని(33) దంపతులు వేర్వేరు ప్రైవేటు సంస్థల్లో
చెన్నై: వాషర్మెన్పేటలోని అశోక్నగర్లో దంపతులు ఉరేసుకున్నారు. వెస్ట్ మాంబళం రాజాజీవీధికి చెందిన మణికంఠన్(34), నందిని(33) దంపతులు వేర్వేరు ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నారు. వివాహమై ఏడాది గడిచినా సంతానం కలగకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో మణికంఠన్కు కరోనా పాజిటివ్ రావడంతో వారి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. చికిత్సలు అనంతరం కోలుకున్న మణికంఠన్ యధావిధిగా విధులకు వెళ్లాడు. అక్కడి నుంచి భార్యకు ఫోన్ చేయగా, ఆమె ఫోన్ తీయలేదు. పనిమనిషికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని కోరాడు. ఆమె ఇంటికి వెళ్లగా, నందిని ఉరేసుకొని ఉండడం గమనించి దిగ్ర్భాంతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓమందూరర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకొని ఇంటికొచ్చిన మణికంఠన్ కొద్ది క్షణాల్లోనే గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.