పితాని కుమారుడికి ముందస్తు బెయిల్‌ నో

ABN , First Publish Date - 2020-07-14T08:04:37+05:30 IST

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను హైకోర్టు

పితాని కుమారుడికి ముందస్తు బెయిల్‌ నో

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను హైకోర్టు తిరస్కరించింది. ఈఎ్‌సఐ కేసులో ఏసీబీ అధికారులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తూ పితాని వెంకట సురేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. పితాని మాజీ కార్యదర్శి మురళీమోహన్‌ కూడా ఇదే విజ్ఞప్తితో హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత సోమవారం ఆదేశాలిచ్చారు. కాగా.. ఈవ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన మురళీమోహన్‌.. సాధారణ బెయిల్‌ కోరుతూ మళ్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక, ఇదే వ్యవహారంలో సాధారణ బెయిల్‌ కోరుతూ హైకోర్టులో మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Updated Date - 2020-07-14T08:04:37+05:30 IST