‘ పథకాలు అందడం లేదు’

ABN , First Publish Date - 2021-06-24T05:02:43+05:30 IST

సంక్షేమ పథకాలు తమకు అంద డం లేదని డెంకాడ మండలం గుణుపూరు పేటకు చెందిన మహిళలు తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జేసీ మహేష్‌ కుమార్‌ను కలిసి సమస్యను వివరించారు.

‘ పథకాలు అందడం లేదు’
జేసీకి విన్నవించుకున్న మహిళలు

 కలెక్టరేట్‌:  సంక్షేమ పథకాలు తమకు అంద డం లేదని డెంకాడ మండలం గుణుపూరు పేటకు చెందిన మహిళలు తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జేసీ  మహేష్‌ కుమార్‌ను కలిసి సమస్యను వివరించారు.  పింఛన్లు, వాహన మిత్ర, చేయూత వంటివి వర్తించడం లేదన్నారు. రాజకీయ కక్షతో తమకు పథకాలు అందకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  గ్రామంలోని చాలామంది అనర్హులకు పింఛన్లు మం జూరు చేశారని ఆరోపించారు.  దీనిపై ఉన్నతాధికారులు  విచారణ చేసి అర్హులకు న్యాయం చేయాలని వారు  కోరారు. 

 

Updated Date - 2021-06-24T05:02:43+05:30 IST