మంత్రిపై ఆరోపణలు చేయలేదు

ABN , First Publish Date - 2021-04-24T05:01:41+05:30 IST

మంత్రిపై ఆరోపణలు చేయలేదు

మంత్రిపై ఆరోపణలు చేయలేదు

శామీర్‌పేట: మంత్రి మల్లారెడ్డి మీద తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన సుబ్బారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం శామీర్‌పేటలో విలేకరులతో మాట్లాడుతూ.. శామీర్‌పేట మండలం ఉప్పర్‌పల్లి గ్రామంలో తాను 2006లో కొంత భూమి కొనుగోలు చేశానన్నారు. ఇప్పుడు ఆ భూముల ధరలు పెరగడంతో కొందరు వ్యక్తులు ‘మేము కబ్జాల్లో ఉన్నామని, మాకు మంత్రి మల్లారెడ్డి మద్దతు ఉంది’ అని భయబ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి అనుచరులమని చెప్పుకుంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వారిపై ఆరోపణలు చేశానని, మంత్రి మల్లారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వివరించారు. శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వారిపై ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేశానని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

Updated Date - 2021-04-24T05:01:41+05:30 IST