ఎన్ఎంయు అధ్యక్షుడు మల్లికార్జునరావు మృతి
ABN , First Publish Date - 2021-05-13T06:18:32+05:30 IST
జంగారెడ్డిగూడెం ఎన్ఎంయు జిల్లా అధ్యక్షుడు కాకి మల్లికార్జునరావు కోవిడ్తో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెం దారు.
జంగారెడ్డిగూడెం, మే 12 : జంగారెడ్డిగూడెం ఎన్ఎంయు జిల్లా అధ్యక్షుడు కాకి మల్లికార్జునరావు కోవిడ్తో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెం దారు. ఆయన ఆర్టీసీలో 1986లో విధుల్లో చేరారు. ఎన్ఎంయులో క్రియాశీల కంగా వ్యవహరించిన ఈయన 30 ఏళ్ల పాటు ఎన్ఎంయు కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మల్లికా ర్జున రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన మృతిపట్ల టీడీపీ సీనియర్ నాయకుడు పెనుమర్తి రామ్కుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మల్లికార్జునరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.