గిరిజన హాస్టళ్లలో పారిశుధ్య పనులు చేపట్టండి

ABN , First Publish Date - 2020-11-01T11:25:22+05:30 IST

జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పీవో ఆనంద మణికుమార్‌ తెలిపారు.

గిరిజన హాస్టళ్లలో పారిశుధ్య పనులు చేపట్టండి

 ప్రాజెక్టు అధికారి ఆనంద మణికుమార్‌


నెల్లూరు ( వీఆర్సీ ) అక్టోబరు 31 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో   పారిశుధ్య పనులు చేపట్టాలని పీవో ఆనంద మణికుమార్‌ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ప్రిన్సిపాల్స్‌, సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 2న  పాఠశాలలు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందస్తుగా వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో  పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నారు.  అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. సమావేశంలో పర్యవేక్షకులు నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T11:25:22+05:30 IST