గిరిజన హాస్టళ్లలో పారిశుధ్య పనులు చేపట్టండి
ABN , First Publish Date - 2020-11-01T11:25:22+05:30 IST
జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పీవో ఆనంద మణికుమార్ తెలిపారు.
ప్రాజెక్టు అధికారి ఆనంద మణికుమార్
నెల్లూరు ( వీఆర్సీ ) అక్టోబరు 31 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పీవో ఆనంద మణికుమార్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ప్రిన్సిపాల్స్, సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 2న పాఠశాలలు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందస్తుగా వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. సమావేశంలో పర్యవేక్షకులు నవీన్ పాల్గొన్నారు.