వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం
ABN , First Publish Date - 2020-11-01T11:19:46+05:30 IST
రామాయణం రచయిత వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఇన్చార్జి కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు.
జయంతి సభలో ఇన్చార్జి కలెక్టర్ హరేందిర ప్రసాద్
నెల్లూరు(వెంకటేశ్వరపురం) అక్టోబరు 31 : రామాయణం రచయిత వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఇన్చార్జి కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని అంబేద్కర్ భవనంలో శనివారం ఉదయం వాల్మీకి మహర్షి జయంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జి కలెక్టర్, వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణంలోని మంచిని అందరూ పాటించాలని, వాల్మీకి రచనలు ప్రజలందరికీ చేరాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ సూర్యప్రకాష్రావు మాట్లాడుతూ వేటాడి బతుకు సాగిస్తున్న వాల్మీకి తన జీవన మార్గాన్ని మార్చుకొని రామయణ మహా గ్రంథాన్ని రచించారన్నారు. కార్యక్రమంలో డీపీవో ధనలక్ష్మి, ఆర్డీవో హుస్సేన్సాహేబ్, వీరిచలపతి , బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.