నూతన పారిశ్రామిక విధానం భేష్
ABN , First Publish Date - 2020-10-28T10:46:37+05:30 IST
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కోసం నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం ఎంతో బాగుందని డిక్కీ కోఆర్డినేటర్ కే శ్రీనివాసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
డిక్కీ కోఆర్డినేటర్ శ్రీనివాసులు
నెల్లూరు(వెంకటేశ్వరపురం), అక్టోబరు 27 : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కోసం నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం ఎంతో బాగుందని డిక్కీ కోఆర్డినేటర్ కే శ్రీనివాసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు పురుషులకు 35 శాతం, మహిళలకు 45 శాతం పెట్టుబడి సాయం ఉండగా ప్రస్తుతం అందరికీ సమానంగా 45 శాతం ఇవ్వడం హర్షణీయమన్నారు. గరిష్ఠంగా కోటి రూపాయల సబ్సిడీ ఇవ్వడంతోపాటు భూమి కొనుగోలులో 50 శాతం సబ్సిడీతోపాటు వాయిదాల పద్ధతి అమలు చేశారన్నారు. పారిశ్రామికవాడల్లో ఎస్సీలకు 16.2, ఎస్టీలకు 6 శాతం భూముల కేటాయింపు నిబంధన ప్రశంసనీయమన్నారు.