180 ఎకరాల రిజర్వాయర్‌ భూమి ఆక్రమణ

ABN , First Publish Date - 2020-09-27T10:23:25+05:30 IST

నగర పంచాయతీ పరిధిలోని వవ్వేరులో కనిగిరి రిజర్వాయర్‌కు చెందిన 920 సర్వే నెంబరులోని 180 ఎకరాల భూమిని నాలుగు కుటుంబాల వారు ఆక్రమించారని దళిత బహుజన సమాఖ్య నాయకులు తహసీల్దారు షఫీమాలిక్‌కు శనివారం ఫిర్యాదు చేశారు.

180 ఎకరాల రిజర్వాయర్‌ భూమి ఆక్రమణ

తహసీల్దారుకు బహుజన సమాఖ్య ఫిర్యాదు


బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 26: నగర పంచాయతీ పరిధిలోని వవ్వేరులో కనిగిరి రిజర్వాయర్‌కు చెందిన 920 సర్వే నెంబరులోని 180 ఎకరాల భూమిని నాలుగు కుటుంబాల వారు ఆక్రమించారని దళిత బహుజన సమాఖ్య నాయకులు తహసీల్దారు షఫీమాలిక్‌కు శనివారం ఫిర్యాదు చేశారు.


ఆ భూమిని పేదలకు పంచాలని కోరారు. కొన్నేళ్ల క్రితం ఈ భూ ఆక్రమణపై అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ అధికారిగా జేసీ రేఖారాణిని నియమించారని వివరించారు.  విచారణలో ఆక్రమిత భూమికి ఏర్పాటు చేసిన ఇనుప (ద్వారాలు) గేట్లు కూడా తొలగించారని వివరించారు.


అదే సమయంలో జేసీ బదిలీ కావడంతో మళ్లీ గేట్లు ఏర్పాటు చేసుకుని పొలం సాగుచేసుకుంటున్నారని వివరించారు.  ఆక్రమిత భూమిని సర్వే చేయించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాల కోరారు. తహసీల్దారుకు ఫిర్యాదు చేసిన వారిలో దళిత బహుజన సమాఖ్య నాయకులు జి.నరసింహులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-09-27T10:23:25+05:30 IST