సమస్యలు సత్వరమే పరిష్కరిస్తున్నాం
ABN , First Publish Date - 2020-09-23T09:21:43+05:30 IST
గ్రామ సచివాలయం, వలంటరీ వ్యవస్థల ద్వారా గ్రామాల్లో నెలకొన అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి
వెంకటాచలం, సెప్టెంబరు 22 : గ్రామ సచివాలయం, వలంటరీ వ్యవస్థల ద్వారా గ్రామాల్లో నెలకొన అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. మండలంలోని కంటేపల్లి గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రెండో పంట సాగులో పండించిన ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఇతర జిల్లాలకైనా తరలించి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులపై కేసులు ఎత్తివేయించామన్నారు.
ఈ 14 నెలల్లోనే కంటేపల్లి పంచాయతీలో రూ. 3 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశామన్నారు. పంచాయతీలో ఉన్న అర్హులందరికీ ఇళ్ల పట్టాలు, భూములు సాగుచేసుకునేవారికి పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎ. సరళ, నాయకులు మందల వెంకటశేషయ్య, చాట్ల వెంకటసుబ్బయ్య, వెలుబోయిన వెంకటేశ్వర్లు, తుపాకుల కిరణ్కుమార్, అస్తోటి శివకుమార్, నజీముద్దీన్ పాల్గొన్నారు.