బీజేపీలో వైసీపీ నేత చేరిక
ABN , First Publish Date - 2020-09-23T09:08:52+05:30 IST
నాయుడుపేట పట్టణానికి చెందిన వైసీపీ నేత దువ్వూరు మధుసూదన్రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
నాయుడుపేట టౌన్ , సెప్టెంబరు 22 : నాయుడుపేట పట్టణానికి చెందిన వైసీపీ నేత దువ్వూరు మధుసూదన్రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రరెడ్డి, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్రెడ్డి ఆధ్వర్యంలో మధుసూదన్రెడ్డికి, ఆయన అనుచరులు యశ్వంత్రెడ్డిలకు సోము వీర్రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ పాలలను మెచ్చి బీజేపీలో చేరినట్లు మధుసూదన్రెడ్డి తెలిపారు.