ప్రార్థన మందిరాల్లో నిరంతర తనిఖీలు
ABN , First Publish Date - 2020-10-01T08:58:16+05:30 IST
జిల్లావ్యాప్తంగా ప్రార్థనా మందిరాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎస్పీ భాస్కర్భూషణ్
నెల్లూర్డు (క్రైం), సెప్టెంబరు 30 : జిల్లావ్యాప్తంగా ప్రార్థనా మందిరాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా రౌడీపీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించామని, 752 మందిని బైండోవర్ చేసుకున్నట్లు చెప్పారు. ప్రార్థన మందిరాల కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తూ తనిఖీల కోసం ప్రత్యేకంగా డైనమిక్ బీట్ను రూపొందించినట్లు చెప్పారు.