నైజీరియా డ్రగ్‌ పెడ్లర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-10-28T16:46:04+05:30 IST

నైజీరియాకు చెందిన డ్రగ్‌ పెడ్లర్‌ను బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇతడి ప్రధాన అనుచరుడు గోవాలో ఉన్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం బయల్దేరి వెళ్లింది. గోవా నుంచి తనకు అందే

నైజీరియా డ్రగ్‌ పెడ్లర్‌ అరెస్టు

                  - రూ.20 లక్షల విలువైన మత్తుమందు మాత్రలు స్వాధీనం


బెంగళూరు(Karnataka): నైజీరియాకు చెందిన డ్రగ్‌ పెడ్లర్‌ను బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇతడి ప్రధాన అనుచరుడు గోవాలో ఉన్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం బయల్దేరి వెళ్లింది. గోవా నుంచి తనకు అందే ఎండీఎంఏ అనే మత్తు మాత్రలను నైజీరియాకు చెందిన ఈ పెడ్లర్‌ తెప్పించుకుని ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు విక్రయించే వాడని దర్యాప్తులో బయటపడిందని రామమూర్తిన గర్‌ పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన నైజీరియా దేశస్తుడి నుంచి రూ.20 లక్షలకు పైగా విలువ చేసే మత్తుమందు మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-10-28T16:46:04+05:30 IST