నైజీరియా డ్రగ్ పెడ్లర్ అరెస్టు
ABN , First Publish Date - 2021-10-28T16:46:04+05:30 IST
నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ను బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇతడి ప్రధాన అనుచరుడు గోవాలో ఉన్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం బయల్దేరి వెళ్లింది. గోవా నుంచి తనకు అందే
- రూ.20 లక్షల విలువైన మత్తుమందు మాత్రలు స్వాధీనం
బెంగళూరు(Karnataka): నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ను బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇతడి ప్రధాన అనుచరుడు గోవాలో ఉన్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం బయల్దేరి వెళ్లింది. గోవా నుంచి తనకు అందే ఎండీఎంఏ అనే మత్తు మాత్రలను నైజీరియాకు చెందిన ఈ పెడ్లర్ తెప్పించుకుని ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులకు విక్రయించే వాడని దర్యాప్తులో బయటపడిందని రామమూర్తిన గర్ పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన నైజీరియా దేశస్తుడి నుంచి రూ.20 లక్షలకు పైగా విలువ చేసే మత్తుమందు మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు సీసీబీ పోలీసులు తెలిపారు.