Nizamsagar ప్రాజెక్ట్కు భారీగా పోటెత్తిన వరద
ABN , First Publish Date - 2022-07-13T15:15:02+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్ట్కు భారీగా వరద పోటెత్తింది.
కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamsagar project)కు భారీగా వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్లోకి 9420 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1395.59 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 7.284 టీఎంసీలుగా కొనసాగుతోంది.