మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో వృద్ధుడి హత్య

ABN , First Publish Date - 2021-11-13T16:54:25+05:30 IST

మంత్రాలు చేస్తున్నాడే నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో వృద్ధుడి  హత్య

నిజామాబాద్: మంత్రాలు చేస్తున్నాడే నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. మతిస్థిమితం కోల్పోయిన బోధన్‌కు చెందిన గంగారాం ఈ నెల  8 న  అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నవిపేట్ మండలం ఫత్తెనగర్ రైల్వే ప్లాట్ ఫామ్‌పై గంగారాం మృతదేహం కనిపించింది. గంగారాంను మంత్రగాడనే నెపంతో ఆరుగురు వ్యక్తులు హత్య చేసి పడేసినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు.

Updated Date - 2021-11-13T16:54:25+05:30 IST