నిజామాబాద్లో గుర్తుతెలియని మహిళ హత్య
ABN , First Publish Date - 2021-10-05T15:08:14+05:30 IST
జిల్లాలోని మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైంది.
నిజామాబాద్: జిల్లాలోని మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైంది. కొందరు దుండగులను మహిళను హత్య చేసి ఆపై శవాన్ని పెట్రోలు పోసి తగలబెట్టారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్కాడ్ ద్వారా పోలీసులు తనిఖీ చేస్తున్నారు.