విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2021-09-29T15:46:51+05:30 IST

జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.

విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం

నిజామాబాద్: జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన చోటు  చేసుకుంది. ఓ కాలేజ్ వచ్చిన విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థినిని వెంబడించి, బలవంతంగా మద్యం తాగించి మరీ యువకులు ఈ దారుణానికి తెగబడ్డారు. బస్టాండు సమీపంలోని ఓ ఆసుపత్రి గదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలోని సఖి సెంటర్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

Updated Date - 2021-09-29T15:46:51+05:30 IST