నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-03-07T20:01:08+05:30 IST

జిల్లాలోని ఆర్ముర్ మండలం చెపూర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు.

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

నిజామాబాద్: జిల్లాలోని ఆర్ముర్ మండలం చెపూర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. అతివేగంతో దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారు నిర్మల్ నుండి ఆర్మూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు రాము(22), జ్ఞానేశ్వర్ గౌడ్(30)లుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-03-07T20:01:08+05:30 IST