Nizamabad జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-10T14:49:28+05:30 IST

జిల్లాలోని కమ్మర్‌పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి

Nizamabad జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్: జిల్లాలోని కమ్మర్‌పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో చిన్నారి శరణ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం స్థానికులు శరణ్యను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తలిరంచారు. బైక్‎ను ఢీకొట్టి వాహనం ఆపకుండానే వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి..వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులు: దంపతులు కృష్ణ, రజిత, కూతురు రాగిణిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

Read more