నిజామాబాద్ జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-08-15T20:28:47+05:30 IST

జిల్లాలోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు చేతిలో మామ, బావ మరిది హతమయ్యారు.

నిజామాబాద్ జిల్లాలో దారుణం

నిజామాబాద్: జిల్లాలోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు చేతిలో మామ, బావ మరిది హతమయ్యారు. మామ సంజీవ రావు షిండే, బావమరిది జిలానీ షిండేను అల్లుడు కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారం రోజుల కిందట బతుకుదెరువు కోసం ఆ కుటుంబం మహారాష్ట్ర నుండి డిచ్‌పల్లికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-08-15T20:28:47+05:30 IST