నిజామాబాద్ జిల్లా: తీన్మార్ మల్లన్నతో సహా ఐదుగురిపై కేసు
ABN , First Publish Date - 2021-09-12T17:00:59+05:30 IST
నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నతో సహా ఐదుగురిపై కేసు నమోదయింది.
నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నతో సహా ఐదుగురిపై కేసు నమోదయింది. తీన్మార్ మల్లన్న పాదయాత్ర కోసం రూ. 20 లక్షలు ఇవ్వాలని కల్లు వ్యాపారి జయవర్ధన్ గౌడ్కి డిమాండ్ చేశారు. దీంతో వ్యాపారి ఆగస్టులో రూ. 5 లక్షలు చెల్లించాడు. మరో రూ. 15 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఉప్పు సంతోష్, రాధాకిషన్, రాజాగౌడ్, సాయిగౌడ్, తీన్మార్ మల్లన్నలపై పోలీసులు కేసు నమోదు చేశారు.