Crime News: ఆ నలుగురి ఆత్మహత్యకు కారణం వేధింపులే..
ABN , First Publish Date - 2022-08-22T20:01:18+05:30 IST
రియల్టర్ సూర్య ప్రకాష్ కుటుంబం సూసైడ్ కేసులో నిజామాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
నిజామాబాద్ (Nizamabad): రియల్టర్ సూర్య ప్రకాష్ (Surya Prakash) కుటుంబం సూసైడ్ (Suicide) కేసులో నిజామాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ అధికారిగా నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లును నియమించారు. నలుగురి ఆత్మహత్యకు కారణం వేధింపులే అని గుర్తించారు. వెంకట సందీప్, కిరణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి ఈ ముగ్గురి వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో సూర్య ప్రకాష్ చెప్పారు. 15 రోజుల క్రితం సూర్య ప్రకాష్పై ఈ ముగ్గురు దాడి చేసి.. ఓ పోలీస్ ఉన్నతాధికారి బంధువు ద్వారా కేసులు పెట్టిస్తామని బెదిరించారు. దీంతో సూర్య ప్రకాష్ తన కుటుంబంతో నిజామాబాద్కు వచ్చి ఓ హోటల్లో బస చేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని శంకరపల్లి వెంచర్తో ఈ గొడవ మొదలయింది.