నిజామాబాద్: ఎస్‌బీఐ బ్యాంక్‌లో చోరీ

ABN , First Publish Date - 2020-09-21T17:32:26+05:30 IST

జిల్లాలోని రెంజల్ మండలం సాటాపూర్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో దుండగులు చోరీకి తెగబడ్డారు.

నిజామాబాద్: ఎస్‌బీఐ బ్యాంక్‌లో చోరీ

నిజామాబాద్: జిల్లాలోని రెంజల్ మండలం సాటాపూర్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో దుండగులు చోరీకి తెగబడ్డారు. బ్యాంక్ కిటికీలు పగులగొట్టి  దుండగులు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్‌తో వేలిముద్రలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T17:32:26+05:30 IST