దీనదయాళ్కు నివాళి
ABN , First Publish Date - 2022-09-26T04:53:31+05:30 IST
పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం దీనదయాళ్ 105వ జయంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కోవూరు, సెప్టెంబరు25: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం దీనదయాళ్ 105వ జయంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు ఐనకోట రఘరామయ్య మాట్లాడుతూ ఏకాత్మతా మానవతావాదాన్ని ప్రవేశపెట్టిన దీనదయాళ్ ఆదర్శపురుషుడని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బేతిరెడ్డి నగేష్, మునగపాటి పూర్ణచంద్రరావు, పచ్చిపాల హరనాధరెడ్డి, విన్నకోట బాలకృష్ణ, లక్కిరెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.