హర్యానా మాజీ సీఎం చౌతాలాను కలిసిన నితీశ్ కుమార్

ABN , First Publish Date - 2021-08-02T03:30:05+05:30 IST

హర్యానా మాజీ సీఎం చౌతాలాను కలిసిన నితీశ్ కుమార్

హర్యానా మాజీ సీఎం చౌతాలాను కలిసిన నితీశ్ కుమార్

న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాను బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆదివారం ఢిల్లీలో కలుసుకున్నారు. వీరిద్దరి కలయిక ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుత భేటీ మర్యాదపూర్వకమేనని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని నితీశ్ కుమార్ వివరణ ఇచ్చారు. ఓం ప్రకాశ్ చౌతాలా అంటే తనకు అభిమానమని, ఆ అభిమానంతో ఆయనను కలుసుకున్నట్లు నితీశ్ పేర్కొన్నారు.


‘‘ఓం ప్రకాశ్ చౌతాలా అంటే నాకు చాలా కాలంగా గౌరవం. చాలా కాలంగా మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీకి వస్తే కలవాలని ఆయన నాతో అన్నారు. అందుకే ఆయనను ఈరోజు కలుసుకున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమే’’ అని నితీష్ కుమార్ అన్నారు.

Updated Date - 2021-08-02T03:30:05+05:30 IST