కోవిడ్ పరీక్షలు చేయంచుకున్న నితీష్

ABN , First Publish Date - 2020-07-05T00:52:39+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన కార్యదర్శులు కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నట్టు..

కోవిడ్ పరీక్షలు చేయంచుకున్న నితీష్

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన కార్యదర్శులు కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నట్టు తెలిసింది. వీరంతా హాజరైన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత ఒకరు పాల్గొనడం, ఆయనకు కరోనా సోకిందని తెలియడంతో నితీష్ తదితరులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీనికి ముందు, శుక్రవారం ఉదయం బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ అవదేశి నారాయణ్ సింగ్, ఆయన భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది.


ఈనెల 1న తొమ్మిది మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో నారాయణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ సుశీల్ కుమార్ మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు బీహార్ అసెంబ్లీ స్పీకర్ కుమార్ చౌదరి, మంత్రులు శరవణ్ కుమార్, మంగల్ పాండే, వినోద్ నారాయణ్ ఝా, బీజేపీ విప్ (మండలి) రీనా యాదవ్, ఎమ్మెల్యేలు బరి సిద్ధిఖి, భోలా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నితీష్ వైద్య పరీక్షల ఫలితాలు తెలియాల్సి ఉన్నాయి.

Updated Date - 2020-07-05T00:52:39+05:30 IST