మరోసారి ఇఫ్తార్ పార్టీలో కలుసుకున్న నితీష్, తేజస్వీ

ABN , First Publish Date - 2022-04-29T01:22:18+05:30 IST

కొద్ది రోజుల క్రితం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఒక ఇఫ్తార్ పార్టీలో కలుసుకున్నారు. ఆ ఇఫ్తార్ పార్టీ తేజస్వీ ఇంట్లోనే నిర్వహించారు. దానికి నితీష్‌ను ఆహ్వానించారు. కాగా, వీరిద్దరూ గురువారం మరోసారి ఇఫ్తార్ పార్టీలో..

మరోసారి ఇఫ్తార్ పార్టీలో కలుసుకున్న నితీష్, తేజస్వీ

పాట్నా: కొద్ది రోజుల క్రితం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఒక ఇఫ్తార్ పార్టీలో కలుసుకున్నారు. ఆ ఇఫ్తార్ పార్టీ తేజస్వీ ఇంట్లోనే నిర్వహించారు. దానికి నితీష్‌ను ఆహ్వానించారు. కాగా, వీరిద్దరూ గురువారం మరోసారి ఇఫ్తార్ పార్టీలో కలుసుకున్నారు. ఈసారి ఇఫ్తార్ పార్టీ నిర్వహించింది నితీష్ కుమార్. అతిథి తేజస్వీ యాదవ్. కొద్ది రోజుల తేడాతో అధికార విపక్ష నేతలు ఇలా కలుసుకోవడం పట్ల బిహార్ రాజకీయాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. కాగా, 2017లో లాలూ నివాసంలో ఇచ్చిన విందుకు నితీశ్ హాజరయ్యారు. ఆ సమయంలో ఆర్‌జేడీ, జేడీయూ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఇరు పార్టీలు రాష్ట్రంలో వైరి పార్టీలుగా ఉన్నాయి.

Updated Date - 2022-04-29T01:22:18+05:30 IST