TS News: నీతిఆయోగ్ భేటీని కేసీఆర్‌ బహిష్కరించడం దుర్మార్గం: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-07T22:41:06+05:30 IST

నీతిఆయోగ్ (NITI Aayog) భేటీని సీఎం కేసీఆర్‌ బహిష్కరించడం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తప్పుబట్టారు.

TS News: నీతిఆయోగ్ భేటీని కేసీఆర్‌ బహిష్కరించడం దుర్మార్గం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: నీతిఆయోగ్ (NITI Aayog) భేటీని సీఎం కేసీఆర్‌ బహిష్కరించడం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర వ్యవస్థలపై కేసీఆర్‌ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధిపై ఏ మాత్రం ఆకాంక్ష ఉన్నా ఈ వేదికపై వచ్చి మాట్లాడాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ (KCR) లేకపోతే తెలంగాణలో ఏం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. ఏ రకమైన పాలన చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన గురించి ఎవరిని అడిగినా.. కథలు, కథలుగా చెప్పుకుంటారని తెలిపారు. అధికారం పోతుందనే భయంతోనే కేంద్రంపై కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్‌ డ్రామాలు ఆడుతున్నారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2022-08-07T22:41:06+05:30 IST