నిస్తార్‌, నిపుణ్‌ జలప్రవేశం

ABN , First Publish Date - 2022-09-23T10:48:26+05:30 IST

నిస్తార్‌, నిపుణ్‌ జలప్రవేశం

నిస్తార్‌, నిపుణ్‌ జలప్రవేశం

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): హిందూస్థాన్‌ షిప్‌యార్డులోని బిల్డింగ్‌ డాక్‌ నుంచి రెండు డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌ (డీఎ్‌సవీ)ను గురువారం ఉదయం అట్టహాసంగా జలప్రవేశం చేయించారు. నేవీ, షిప్‌యార్డు ఉన్నతాధికారులు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పారిశ్రామికవేత్తల సమక్షంలో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌ సతీమణి కళా హరికుమార్‌ చేతులు మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వీటికి నిస్తార్‌, నిపుణ్‌ అని పేర్లు పెట్టారు. ఈ సందర్భంగా అడ్మిరల్‌ హరికుమార్‌ మాట్లాడుతూ... డీఎ్‌సవీ ప్రాజెక్టు వల్ల స్థానికంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.


Updated Date - 2022-09-23T10:48:26+05:30 IST