యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చింది టీడీపీనే

ABN , First Publish Date - 2021-04-13T05:18:19+05:30 IST

యువతకు నిరుద్యోగ భృతి అందించిన ఘనత టీడీపీదేనని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు.

యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చింది టీడీపీనే
పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌

గూడూరురూరల్‌, ఏప్రిల్‌ 12: యువతకు నిరుద్యోగ భృతి అందించిన ఘనత టీడీపీదేనని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. ఈ ప్రభుత్వంలో యువతకు ఎటువంటి సాయం అందించడం లేదన్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి విజయానికి కష్టపడి పనిచేద్దామన్నారు. 

Updated Date - 2021-04-13T05:18:19+05:30 IST