నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-02-14T00:27:12+05:30 IST

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి, డోలా, ఏలూరి లేఖ రాశారు. ప్రకాశం జిల్లాని వెనుకబడిన

నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు

అమరావతి: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి, డోలా, ఏలూరి లేఖ రాశారు. ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలంటూ లేఖలో కోరారు. జిల్లాలోని కరువు పరిస్థితులను విన్నవించుకునేందుకు తగు సమయం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రకాశం వ్యవసాయ ఆధారిత జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత జిల్లాగా ప్రకాశం ఉంది. సరైన వర్షపాతం లేక సాగు, తాగు నీటి కష్టాలు పడుతున్నాము. జిల్లాకి సరైన రహదారి సౌకర్యం లేక, పరిశ్రమలు రాక.. ప్రజలు వలస బాట పడుతున్నారు. ప్రకాశం జిల్లాపై రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం కలగడం లేదు. ఏపీలో వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం లేదు. టీడీపీ హయాంలో వెనుకబడిన జిల్లాలకు అన్ని సదుపాయాలు కల్పించాం. వైసీపీ పాలనలో గత మూడేళ్లుగా జిల్లాకి ఒక్క రూపాయి ఇవ్వలేదు. జిల్లా వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని..ప్రకాశం జిల్లాకి ఆర్థిక చేయూత ఇవ్వాలి’’ అని టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-02-14T00:27:12+05:30 IST