వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్‌: నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2020-03-26T20:29:34+05:30 IST

ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు వైద్య సిబ్బందితోపాటు, పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయం.

వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్‌: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు వైద్య సిబ్బందితోపాటు, పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమ కుటుంబాలను సైతం పక్కనబెట్టి.. నిద్రాహారాలు మాని పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది.


వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు రూ.50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీని ఆమె ప్రకటించారు. ఆకలి చావులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.


Updated Date - 2020-03-26T20:29:34+05:30 IST