Nirmal: మంత్రి ఇంద్రకరణ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2022-02-09T18:18:30+05:30 IST

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేశారు.

Nirmal: మంత్రి ఇంద్రకరణ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

నిర్మల్: పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ  చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు యావత్ తెలంగాణా సమాజాన్ని కించ పరిచేలా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజీపీ నాయకులు వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవెర్చాల్సింది పోయి, తెలంగాణ మీద  విషం చిమ్ముతున్నారని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-02-09T18:18:30+05:30 IST