Basaraలో శివాలయ దీపస్తంభం ధ్వంసం.. రాతి శిలను ఎత్తుకెళ్లిన దుండగులు..

ABN , First Publish Date - 2022-05-10T18:19:55+05:30 IST

బాసర శ్రీ పాప హరేశ్వర ఆలయంలోని పురాతన దీప స్తంభాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

Basaraలో శివాలయ దీపస్తంభం ధ్వంసం.. రాతి శిలను ఎత్తుకెళ్లిన దుండగులు..

Nirmal district: బాసర శ్రీ పాప హరేశ్వర ఆలయంలోని  పురాతన దీప స్తంభాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాతి శిలను ఎత్తుకెళ్లారు. 1500 ఏళ్ల చరిత్ర గల స్తంభాన్ని జేసీబీతో ధ్వంసం చేసినట్లు బాసర వాసులు గుర్తించారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా దుండగులు ఎత్తుకెళ్ళిన శిలలు బిద్రెల్లి గ్రామంలోని ఒక పాకలో లభ్యమయ్యాయి. దీప స్తంభం ధ్వంసంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుప్త నిధుల కోసమే తవ్వి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అడిషనల్ ఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

Read more