Nirmal: పెళ్లింట విషాదం

ABN , First Publish Date - 2021-08-28T15:19:36+05:30 IST

జిల్లాలోని కడెం మండలం పాండవ పూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది.

Nirmal: పెళ్లింట విషాదం

నిర్మల్: జిల్లాలోని కడెం మండలం పాండవ పూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనిక, ఆమె తండ్రి రాజయ్య మృతి చెందారు. ఈ నెల 25 మహారాష్ట్ర యువకునితో మౌనికకు పెళ్లి జరిగింది. అత్తారింటిలో రిసిప్షన్ తర్వాత  ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల స్వగ్రామం కడెం మండలం మద్దిపడగగా గుర్తించారు. పెళ్లై పుట్టింటికి వస్తున్న నవ వధువు, ఆమె తండ్రి మృతితో పెళ్లింట విషాదం నెలకొంది. 

Updated Date - 2021-08-28T15:19:36+05:30 IST