కచ్చా డ్రెయిన్ తవ్వకంపై ఆందోళన
ABN , First Publish Date - 2021-01-27T06:36:32+05:30 IST
కచ్చా డ్రెయిన్ తవ్వకంపై ఆందోళన
ఉయ్యూరు, జనవరి 26 : చెరకు పరిశోధనా స్థానం వద్ద కచ్చాడ్రెయిన్ తవ్వకం వల్ల పొలాల్లోకి మురుగు ప్రవేశించి పరిశోధనలకు ఇబ్బంది కలు గుతుందని ఉయ్యూరు చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు, ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేశారు. కళాశాల రోడ్డులో చెరకు పరిశోధనా కేంద్రంలో నూతన వంగడాలు సృష్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో సమీపంలోని ఇళ్ల నుంచి వచ్చే మురుగు పరిశోధనా కేంద్రం ప్రహరీకి అనుకుని నిల్వ ఉండి పోయేలా జేసీబీతో నగర పంచాయతీ అధికారులు కచ్చా డ్రెయిన్ తవ్వారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చేశారు. కచ్చా డ్రెయిన్ కాకుండా పక్కా డ్రెయిన్ తవ్వాలని నగర కమిషనర్కు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.