కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-11-28T06:03:05+05:30 IST
మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మండల రైతులు వరి ధాన్యం కుప్పల వద్ద నిరసన వ్యక్తం చేశా రు.
పెంబి, నవంబరు 27: మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మండల రైతులు వరి ధాన్యం కుప్పల వద్ద నిరసన వ్యక్తం చేశా రు. వరి పంటను కోత చేసి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని, వరి పంటకు దోమపోటుతో నష్టం వాటి ల్లిందని ఇప్పుడు పంట కోసి నెల రోజులు గడుస్తున్నా వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు కాకపోవడంతో రైతు లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా ఈ విషయమై దృష్టి సారించి వెంటనే వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు చింతకింది రాజేందర్, పుప్పాల శ్రీను, వెంకటేష్, ధొనికేని నరేష్, తదితరులు ఉన్నారు.