కొవిడ్ నిబంధనలు మీరే పెట్టి.. సభలు, ర్యాలీలతో రైతు సంబరాలు ఎంతవరకూ సబబు?: నిరంజన్
ABN , First Publish Date - 2022-01-11T19:18:25+05:30 IST
మీ ప్రభుత్వంలో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రశ్నించారు.
హైదరాబాద్: మీ ప్రభుత్వంలో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రశ్నించారు. ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంటే విద్యాశాఖ మంత్రి కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేదన్నారు. కొవిడ్ నిబంధనలు మీరే పెట్టి సభలు, ర్యాలీలు పెట్టి రైతు సంబరాలు చేసుకోవడం ఎంత వరకు సబబని నిరంజన్ ప్రశ్నించారు. మీరు, బీజేపీ కలిసి ఆడుతున్న తోడు దొంగల ఆట మానేయాలని హితవు పలికారు. మీ ప్రచారాన్ని పక్కనబెట్టి.. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిరంజన్ సూచించారు.