రూ.90 వేలు చోరీ
ABN , First Publish Date - 2021-04-17T05:19:16+05:30 IST
ద్విచక్ర వాహనం ట్యాంక్ కవర్లో పెట్టిన రూ.90 వేలు చోరీకి గురైనట్లు బాధితుడు నంద్యాల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
నంద్యాల(నూనెపల్లె), ఏప్రిల్ 16: ద్విచక్ర వాహనం ట్యాంక్ కవర్లో పెట్టిన రూ.90 వేలు చోరీకి గురైనట్లు బాధితుడు నంద్యాల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మండల కేంద్రమైనగడివేములకు చెందిన నరసింహులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం బ్యాం క్లో సేవింగ్ చేసుకున్న డబ్బును డ్రా చేసుకునేందుకు శుక్రవారం నంద్యాలకు వచ్చారు. స్థానిక కరూర్ వైశ్యా బ్యాంక్లో రూ.90 వేలు నగదును డ్రా చేసుకొని తన ద్విచక్ర వాహనంలోని కవర్లో పెట్టుకొని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళికాంబ దేవాలయం పక్కన ఉన్న ఆయిల్ మిల్ వద్దకు వచ్చాడు. డబ్బును అందులోనే ఉంచుకొని షాపులోకి వెళ్ళి వచ్చి చూసుకునే సరికి డబ్బు చోరీకి గురి కావడంతో లబోదిబోమంటూ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.