Mexicoలో బస్సు బ్రేకులు ఫెయిలై భవనంపైకి దూసుకెళ్లింది..19మంది మృతి

ABN , First Publish Date - 2021-11-27T13:08:27+05:30 IST

సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు బ్రేకులు ఫెయిలై భవనంపైకి దూసుకెళ్లిన దుర్ఘటనలో 19 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు....

Mexicoలో బస్సు బ్రేకులు ఫెయిలై భవనంపైకి దూసుకెళ్లింది..19మంది మృతి

32 మందికి గాయాలు

మెక్సికో : సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు బ్రేకులు ఫెయిలై భవనంపైకి దూసుకెళ్లిన దుర్ఘటనలో 19 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. యాత్రికులు తీర్థయాత్రకు బస్సులో వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీకి నైరుతి దిశలో ఉన్న జోక్విసింగో టౌన్‌షిప్‌లో ఈ ప్రమాదం జరిగిందని సెంట్రల్ మెక్సికో రాష్ట్ర అంతర్గత అంతర్గత కార్యదర్శి రికార్డో డి లా క్రూజ్ తెలిపారు.బస్సు పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ నుంచి రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే చల్మా పట్టణానికి వెళుతోండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని నగరమైన టోలుకాలోని ఆసుపత్రికి తరలించారు. మెక్సికోలో ఇరుకు రోడ్లతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.


Updated Date - 2021-11-27T13:08:27+05:30 IST