ఢిల్లీలో లేదా ఎక్కడా మహిళలు సురక్షితంగా లేరు...Nirbhaya తండ్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-16T16:56:33+05:30 IST

ఢిల్లీలో నిర్భయ దారుణ జరిగి గురువారం నాటికి 9ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో నిర్భయ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఢిల్లీలో లేదా ఎక్కడా మహిళలు సురక్షితంగా లేరు...Nirbhaya తండ్రి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్భయ దారుణ జరిగి గురువారం నాటికి 9ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో నిర్భయ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లేదా దేశంలో ఎక్కడా కూడా మహిళలు సురక్షితంగా లేరని నిర్భయ తండ్రి ఆరోపించారు. నిర్భయ ఘటన 9వ వార్షికోత్సవం సందర్భంగా మహిళల భద్రత గురించి నిర్భయ తండ్రి మాట్లాడారు.నిర్భయ ఘటన జరిగిన రోజు నుంచి చాలా మంది కూతుళ్లు ఇదే రీతిలో దారుణంగా హత్యలకు గురయ్యారని నిర్భయ తండ్రి మండిపడ్డారు.‘‘ఢిల్లీలో నిర్భయ అత్యాచారం కేసు నమోదై నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు.. ఈ కేసు ఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కానీ, గుణపాఠాలు నేర్చుకోలేదని, మహిళల భద్రత ఆందోళనకరంగానే ఉంది’’ అని నిర్భయ తండ్రి చెప్పారు.



పార్లమెంటులో మహిళల మహిళల భద్రత గురించి తరచుగా సభ్యులు మాట్లాడాలని ఆయన కోరారు.నిర్భయ కేసుపై వెబ్ సిరీస్ గురించి అడగ్గా దాన్ని చూడలేదని,వెబ్ సిరీస్ మేకింగ్‌లో మా అభిప్రాయాలు తీసుకోలేదని ఆయన చెప్పారు. దేశంలో మహిళలపై అత్యాచారాల ఘటనలు ఆగిపోయే వరకు ఢిల్లీతోపాటు దేశం మహిళలకు సురక్షితమని చెప్పలేమని నిర్భయ తండ్రి వివరించారు.

Updated Date - 2021-12-16T16:56:33+05:30 IST