Assamలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2021-11-11T17:43:48+05:30 IST

అసోం రాష్ట్రంలోని అసోం-త్రిపుర సరిహద్దుల్లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది దుర్మరణం చెందారు...

Assamలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది దుర్మరణం

కరీంగంజ్ (అసోం): అసోం రాష్ట్రంలోని అసోం-త్రిపుర సరిహద్దుల్లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  9మంది దుర్మరణం చెందారు. కరీంగంజ్ జిల్లాలోని పాథరకండి పోలీసుస్టేషను పరిధిలోని బైతఖల్ ప్రాంతంలోని 8వ నంబరు జాతీయ రహదారిపై ఆటోరిక్షాను వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 9మంది మరణించారు.మృతుల్లో ముగ్గురు పిల్లలున్నారని పోలీసులు చెప్పారు. ఛాత్ పూజలో పాల్గొని తిరిగి ఆటోరిక్షాలో ఇంటికి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆటోరిక్షాను ట్రక్కు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కరీంగంజ్ జిల్లా పోలీసు అధికారి చెప్పారు.అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.  


Updated Date - 2021-11-11T17:43:48+05:30 IST