ఇరు జిల్లాల్లో తొమ్మిది మందికి కరోనా
ABN , First Publish Date - 2022-08-13T07:01:24+05:30 IST
ఇరు జిల్లాల్లో తొమ్మిది మందికి కరోనా
ఖమ్మం కలెక్టరేట్, ఆగస్టు 12: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం తొమ్మిది మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలోని 34 కొవిడ్ పరీక్షా కేంద్రాల్లో 680 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 182 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు.