రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమందికి గాయాలు
ABN , First Publish Date - 2022-01-22T05:06:51+05:30 IST
మండలంలోని నాతవలస టోల్ప్లాజా సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
డెంకాడ, జనవరి 21: మండలంలోని నాతవలస టోల్ప్లాజా సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఎస్ఐ ఎన్.పద్మావతి తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. తిరుపతి యాత్ర నిమి త్తం కొంతమంది ప్రైవేటు టూరిస్టు బస్సులో శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణం వెళ్తున్నారు. ఈ బస్సు నాతవలస వద్దగల టోల్ప్లాజా సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. అందిన సమా చారం మేరకు వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టి, ప్రయాణికులను సురక్షితంగా పంపించారు. డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.