Ganesh idol immersion: నిమజ్జనంలో అపశ్రుతి...నదిలో మునిగి 9మంది మృతి

ABN , First Publish Date - 2022-09-10T12:53:49+05:30 IST

దేశంలో పలు చోట్ల శుక్రవారం రాత్రి ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవంలో(Ganesh idol immersion) అపశ్రుతి చోటుచేసుకుంది....

Ganesh idol immersion: నిమజ్జనంలో అపశ్రుతి...నదిలో మునిగి 9మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో పలు చోట్ల శుక్రవారం రాత్రి ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవంలో(Ganesh idol immersion) అపశ్రుతి చోటుచేసుకుంది.హర్యానా(Haryana), ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిమజ్జనోత్సవంలో 9మంది మరణించారు. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లా మహేందర్ ఘడ్ ప్రాంతంలో యమునా నదిలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఆరుగురు మరణించారు.ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని కొత్వాలీ సఫీపూర్ వద్ద గంగానదిలో మునిగి ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. 7 అడుగుల గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 9మంది యువకులు నీటిలో మునిగారు. వారిలో ఆరుగురు మరణించారు. కొంతమందిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించారు.


Updated Date - 2022-09-10T12:53:49+05:30 IST